Monday, 28 September 2009

స్వైన్‌ ఫ్లూ వ్యాప్తికి కారకులెవరు?

స్వైన్‌ఫ్లూ మహమ్మారి భయం, ఆ వ్యాధి కారక వైరస్‌ కంటే వేగంగా ప్రపంచ మంతటా వ్యాపించింది. ఒక వారం రోజులు మీడియా గగ్గోలు పెట్టింది. తరువాత ప్రచా రోధృతి తగ్గిపోయింది. వైరస్‌ మాత్రం ప్రపం చంలో చాలా చోట్లకు వ్యాపించింది. అయితే ఆ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య, చనిపోయినవారి సంఖ్య మొదట్లో అంచనా వేసిన దానికంటే చాలా తక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.


మామూలు ఫ్లూ వ్యాధికి భిన్నమైన ఈ కొత్త ఫ్లూ వ్యాధి ప్రపంచంలోని ఏఏ ప్రాంతాలకు విస్తరించిందీ, ఎంతటి ప్రాణాంతక మైనది ఇప్పుడు చెప్పబూనటం తొందరపాటే అవుతుంది. ఈ క్రొత్త వైరస్‌ ఎలా మొదల యిందనే దానిపై మాత్రం వివాదం ముదురు తోంది.


ఈ కొత్త వైరస్‌ యొక్క ప్రస్తుత జన్యురూపం మొట్ట మొదటగా 1998లో అమెరికాలోని పందుల ఫారాల్లో కనిపించిందని వ్యాధి నివారణ, నిరోధం కోసం ఏర్పాటు చేసిన అమెరికన్‌ కేంద్రాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వైరస్‌ విజృంభణ మాత్రం మెక్సికోలో జరిగింది. అమెరికా బడా కంపెనీ స్మిత్‌ ఫీల్డుకు చెందిన పందులఫారాలు, పందిమాంసం ఫ్యాక్టరీలు ఉన్న మెక్సికన్‌ పట్టణాల్లో ఈ వ్యాధి బాగా ప్రబలింది. స్మిత్‌ ఫీల్డ్‌ అనుబంధ కంపెనీ అయిన గ్రంజాస్‌ కార్రోల్‌ డి మెక్సికో అనే సంస్థ మెక్సికోలో ఈ పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. స్మీత్‌ఫీల్డు కంపెనీ ఒకటే ఏడాదికి 1100 కోట్ల డాలర్లకు పైగా పంది మాంసం విక్రయాలు జరుపుతుంది. పంది మాంసం వుత్పత్తిక్రమంలో 2.6 కోట్ల టన్నల మేరకు జంతు సంబంధమైన వ్యర్ధ పాదార్థాలు అక్కడపోగుబడతాయని ''రోలింగ్‌స్టోన్‌'' పత్రిక 2006లో ప్రచురించిన ఒక వ్యాసంలో అంచనా వేసింది.


మెక్సికోలోని వెరాక్రజ్‌ రాష్ట్రంలోనూ, లాగ్లోరియా, పెరోట్‌ ప్రాంతాల్లోనూ నివసించే ప్రజలు అనేక సంవత్సరాలుగా ఈ రాకాసి పరిశ్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వున్నారు. 'ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' అమల్లోకి వచ్చీరాగానే 1994లో ఈ భారీస్థాయి పందిమాంసం కర్మాగారం, దానికి అవసరమైన పందులను పెంచే ఫారాలు నెలకొల్పబడినాయి. సరిహద్దుల ఆవలినుంచి ఆమెరికా పెట్టుబడులు ''స్వేచ్చగా'' మెక్సికోలో ప్రవేశించటానికి ఈ ఒప్పందం ద్వారాలు తెరిచింది. అంతేకాదు అమెరికా కంపెనీలు మెక్సికోలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకో వటానికీ, ఎలాంటి అదుపూ లేకుండా శ్రమ దోపిడి చేయటానికీ, మొక్కజొన్న తదితర సరుకుల దిగుమతులతో మెక్సికో ఆర్థిక వ్యవస్థను ముంచెత్తటానికీ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్‌ కంపెనీలకు అవకాశం లభించింది. అమెరికా లోని కొన్ని కఠినతర నిబంధనలనుండి తప్పు కోవడం కోసమే స్మిత్‌ ఫీల్డ్‌ కంపెనీ తన పందిమాంసం ఫ్యాక్టరీలను మెక్సికోలో నెల కొల్పిం దన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వుంది. మాంసం కోసం పెంచే లక్ష లాది పందుల పెంటను ఎరువుగా నిలవ చేయటానికి కంపెనీ అక్కడ పెద్ద పెద్ద చెరువులు ఏర్పాటుచేసింది. మాంసం కోసం కోత దశకు చేరటానికి ముందుగానే చనిపోయే పందులను కుళ్లబెట్టటం కోసం బహిరంగ ప్రదేశంల్లోనే గుట్టలు గుట్టలుగా పడేసి వుంచటం జరుగుతోంది. ఈ వ్యర్ధ పదార్థాల నుంచి వచ్చే కంపుతో మైళ్లతరబడి వాయు కాలుష్యం జరుగుతోంది. అనేక మెక్సికన్‌ పట్టణాల భూగర్భజాలలు కూడా కలుషితమైనాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పంది ఎరువు కుప్పలమీద జీవించే ఈగలు పరిసరా ల్లోని జనావాసాల్లో ముసురుతుంటాయి.


ఫ్లూ వ్యాధి బారిన పడిన పక్షుల రెట్టలను ఒక చోట నుంచి - వేరొక చోటకు చేరవేయటం ద్వారా ఈగలు బర్డ్‌ ఫ్లూ వ్యాధిని వ్యాప్తి చేయగలవనే విషయం అందరికీ తెలిసిందే. పందుల ఎరువులో పెరిగి పెద్ద వయిన ఈగలు, పక్షుల రెట్టల మీద కూడా వాలే అవకాశం వుంది. అందువల్ల, అవి పందులనుంచి, పక్షుల నుంచి, మనుషుల నుంచీ వైరస్‌ జన్యువులను కలగలిపే సాధనాలుగా తయారయినాయి. కొత్త వ్యాధి విజృంభణకు అదొక కారణమయ్యే అవకాశం వుంది.


స్మిత్‌ ఫీల్డ్‌ కంపెనీ పందుల ఫారం ఏర్పాటు చేయటాన్ని 2005లోనే స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు మెక్సికన్‌ వార్తాపత్రిక ''లాజొర్నాడా''లో ప్రచురితమైన వార్తలు తెలుపుతున్నాయి. భారీ స్థాయిలో పందుల పెంపకం, పందిమాంసం వుత్పత్తి కార్యకలాపాలు చేపట్టటాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే నడిచాయి. అయితే 'గ్రంజా కర్రోల్‌' కంపెనీతో కుమ్మక్కయిన వెరాక్రజ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 2008లో అనేక మంది ఉద్యమ కారులను అరెస్టుచేసి జైళ్లలో కుక్కారు. స్వైన్‌ ఫ్లూ విజృంభణ అంతర్జాతీయ వార్తాంశం కావటానికి చాలా కాలం ముందే వందలాది మంది లాగ్లోరియా పట్టణ ప్రజలు శ్వాస సంబంధమైన వ్యాధులకు లోనైట్లు, అనేక మందిలో ఇది న్యూమోనియో రూపం దాల్చినట్లు వార్తలు వచ్చాయి. ఫ్లూ బారిన పడితే వచ్చే సమస్యల్లో న్యూమోనియా ఒకటి. 'వెరా టెక్ట్‌' అనే పేరుగల ప్రయివేటు కంపెనీ ఒకటి అమెరికాలో ఉంది. ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నదీ గమనిస్తూ, నిర్ణీత రుసుము చెల్లించి తమ ఖాతాదారులుగా నమోదు చేసుకున్నవారికి సమాచారం అందించటమే ఈ కంపెనీ పని. వెరాక్రజ్‌ పట్టణంలో స్వైన్‌ ఫ్లూ ఉనికిని ఆ కంపెనీ ఒక నెల ముందుగానే గమనించింది. వ్యాధి నిరోదక కేంద్రానికి తెలియపరచింది. అయితే బయో టెర్రరిజం బూచిపైనే దృష్టినంతా కేంద్రీకరించి వున్న వ్యాధి నిరోధక కేంద్రాలు ఈ విషయాన్ని అనేక వారాలపాటు పట్టించుకో కుండా మూలపడేశాయి.


స్వైన్‌ ఫ్లూ వైరస్‌ బారిన పడినట్లు నిర్థారితమైన మొట్టమొదటి కేసు లాగ్లోరియా పట్టణ ప్రాంతంలోని ఒక యువకునిలో కనిపించింది. అతను తర్వాత కోలుకున్నాడు. తరువాత ఈ వైరస్‌ మెక్సికో సిటీకి, మెక్సికోలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. వాటితో పాటే అమెరికాలోని న్యూయార్కు, కాలిఫో ర్నియా, టెక్సాస్‌ తదితర ప్రదేశాలకూ, ప్రపం చంలోని ఇతర ప్రదేశాలకూ వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే మూడో తేదీన చేసిన ప్రకటన ప్రకారం ప్రపంచం మొత్తం మీద తొమ్మిది వందలకు పైగా స్వైన్‌ఫ్లూ కేసులు నిర్థారితమైనాయి. అందులో సగానికిపైన మెక్సికో లోనే నమోదయినాయి. జబ్బుసోకిన వారిలో ఇరవై మంది మృతి చెందారు. వారిలో పంతొమ్మిది మంది మెక్సికోవాసులు ఒక్కరు అమెరికా వాసి.


ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ స్వైన్‌ ఫ్లూ వైరస్‌, పందులను, పక్షులను, మానవులనూ ఆశించే వైరస్‌ల యొక్క జన్యు మిశ్రమం వల్ల కొత్తగా అభివృద్ధి చెందినదని ఆరోగ్య అధి కారులు తెలియజేశారు. అమెరాకాకు చెందిన ఆరోగ్య అధికారులు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా దాదాపు ఒక దశాబ్ద కాలంపాటు 'హెచ్‌ 5 ఎన్‌-1' గా పిలవ బడుతున్న బర్డ్‌ ఫ్లూ వ్యాధి పైనే తమ దృష్టినంతా కేంద్రీకరించారు. బర్డ్‌ ఫ్లూ ప్రపం చం అంతటా వ్యాప్తి చెందింది. కాని ఎక్కడా మనుషుల జోలికి మాత్రం పోలేదు. కోళ్ళతోనూ, జలచర పక్షులతోనూ మమేకమై పనిచేస్తుండిన కొంత మందికి బర్డుఫ్లూ సోకినప్పటికీ ఒక మనిషి నుండి మరో మనిషికి బర్బుఫ్లూ సోకినదాఖలాలు లేవు.


కొత్తగా ముందుకొచ్చిన ఈ స్వైన్‌ ఫ్లూ భిన్నమైనది. హెచ్‌1 ఎన్‌1గా వ్యవహరిం చబడుతున్న ఈ వైరస్‌కు మనుషులకు సోకే ఫ్లూతో సామీప్యత ఉంది. ఒక మనిషి నుండి వేరొక మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ మనిషి నుండి - పందికి సోకిన సందర్భం ఒకటి కెనడాలో కనిపించింది. మెక్సికోలో ఉండి వచ్చిన కార్మికుడు కెనడా లోని ఈ పందుల ఫారాన్ని సందర్శించిన మీదట ఆ ఫారంలోని చాలా పందులకు ఈ వైరస్‌ సోకినట్లు గమనిం చటం జరిగింది.


వాస్తవం ఏమిటంటే - అమెరి కాలో కనిపించిన స్వైన్‌ ఫ్లూ కేసులు టూరిస్టుల్లోనూ, టూరిస్టులతో సన్నిహితంగా ఉన్నవారిలోనూ మాత్రమే గమనించ బడినాయి. అందువల్ల వలసవచ్చిన వారిపై దాడి చేయటం ఇప్పటికింకా పరిమిత స్థాయిలోనే ఉంది. అయితే బడా వాణిజ్య వర్గాల అధీనంలోని మాస్‌ మీడియా మాత్రం స్మిత్‌ఫీల్డ్‌ కంపెనీ ప్రమేయాన్ని గురించిగాని, నార్త్‌ కరోలినా, ఉంటా తదితర ప్రదేశాల్లోని భారీస్థాయి హాని కరమైన బహుళ జాతి మాంసం కర్మా గారాల ప్రమేయాన్ని గురించి గాని ఏమాత్రం ప్రస్తావించటం లేదు. పర్యా వరణానికీ, ప్రజారోగ్యానికీ ప్రమాదం తెచ్చిపెడుతూ లాభాలు గడిస్తున్న బడా బహుళజాతి కంపెనీలే అసలు నేరస్తులు. స్వైన్‌ ఫ్లూ నేరస్తులు వారే కనుక వారినే ప్రపంచం శిక్షిం చాలి.

note article took from the Markist Paper markist

No comments:

Post a Comment